క్యాతనపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై తీర్మానాలు

క్యాతనపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై తీర్మానాలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్​ కౌన్సిల్​సమావేశంలో పలు అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేశారు. శనివారం మున్సిపల్​ఆఫీస్​లో చైర్​పర్సన్​ గొడిసెల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. రూ.5లక్షలతో కోతులను పట్టడం, వాటర్​సప్లై, స్ట్రీట్​లైటింగ్, రిపేర్లు, సామగ్రి కొనుగోలుకు రూ.60వేలు, సానిటేషన్ నిర్వహణ కోసం రూ.2లక్షలు, శానిటేషన్​పనులు చేసే వాహన డ్రైవర్లు, కూలీలకు రూ.4లక్షల నిధులను చెల్లించే తదితర తీర్మానాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. 

అనంతరం మున్సిపల్​ కమిషనర్​ మారుతీప్రసాద్​తో కలిసి చైర్​పర్సన్​కొత్తగా కొనుగోలు చేసిన నాలుగు స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. సమావేశంలో వైస్ ​చైర్​పర్సన్  సరిత, రెవెన్యూ ఆఫీసర్​సతీశ్, డీఈ సుమతి, ఏఈ ఆశ్రిత్ తదితరులు పాల్గొన్నారు.