సెయిలింగ్‌‌‌‌ రెగట్టా విన్నర్‌‌‌‌ లాహిరి

సెయిలింగ్‌‌‌‌ రెగట్టా విన్నర్‌‌‌‌ లాహిరి

హైదరాబాద్‌‌‌‌: తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్‌‌‌‌ రెగట్టా చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ను లాహిరి కొమరవెల్లి గెలుచుకుంది. శనివారం ముగిసిన ఈ టోర్నీలో సబ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ విభాగంలో లాహిరి స్వర్ణం సాధించగా, ఆమె సోదరి దీక్షిత కొమరవెల్లి రెండో ప్లేస్‌‌‌‌తో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో లాహిరి, దీక్షిత చెరో 15 పాయింట్లతో సమంగా నిలిచారు. 

అయితే తక్కువ వయసు, బరువు ఉన్న లాహిరి 5 రేస్‌‌‌‌ల్లో నెగ్గగా, దీక్షిత 4 రేస్‌‌‌‌లతోనే సరిపెట్టుకుంది. పదో రేస్‌‌‌‌లో దీక్షిత నిరాశపర్చడంతో లాహిరికి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ దక్కింది. సబ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ బాలుర విభాగంలో బన్నీ బొంగుర్‌‌‌‌, వినోద్‌‌‌‌ దండు, రిజ్వాన్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ తొలి మూడు ప్లేస్‌‌‌‌ల్లో నిలిచారు. జూనియర్‌‌‌‌ బాలికల విభాగంలో ఝాన్సీ ప్రియా లావేటి 8 పాయింట్లతో గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను గెలుచుకుంది. 

ఓవరాల్‌‌‌‌ జూనియర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ సొంతం చేసుకుంది. వైష్ణవి వీరవంశం, తనూజ కామేశ్వర్‌‌‌‌ వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను కైవసం చేసుకున్నారు. బాలుర కేటగిరీలో శ్రవణ్‌‌‌‌ కత్రావత్‌‌‌‌కు స్వర్ణం లభించింది.