లక్ష్మీ కటాక్షం మూవీ మే 10న విడుదల

లక్ష్మీ కటాక్షం మూవీ మే 10న విడుదల

సాయి కుమార్ కీలకపాత్రలో.. వినయ్, అరుణ్, దీప్తి వర్మ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’.  ఫర్ ఓట్ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌లైన్. సూర్య దర్శకత్వంలో  యు  శ్రీనివాసుల రెడ్డి,  బి నాగేశ్వర రెడ్డి, వహీద్ షేక్, కే పురుషోత్తం రెడ్డి నిర్మించారు. ఈ పొలిటికల్ సెటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిత్రాన్ని మే 10న విడుదల చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే  వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.  ఓటర్లే వారి ఓటుకు ఒక రేటు ఫిక్స్ చేసుకుని నాయకులని ముప్పు తిప్పలు పెట్టే డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.