
బాలీవుడ్ లో ఆగస్టు 11న ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఆ రోజు ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. మిస్టర్ పర్పెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు అమీర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించగా... తాజాగా అక్షయ్ కుమార్ యాక్ట్ చేసిన ‘రక్షా బంధన్’ మూవీని కూడా అదే రోజు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో ‘తేరే సాత్ హూం మై’ అనే సాంగ్ కు సంబంధించిన చిన్న ఆడియోను జోడించారు.
ఇక ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్ స్టేడియంలో అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఇక అద్వైత్ చందన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో పాటు, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రక్షా బంధన్ విషయానికొస్తే... ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ సరసన భూమి పెడ్నేకర్ నటిస్తోంది. ఇక ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానుండంతో... ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది.
Akshay Kumar's 'Raksha Bandhan' to clash with Aamir Khan's 'Laal Singh Chadha' on August 11
— ANI Digital (@ani_digital) June 16, 2022
Read @ANI Story | https://t.co/FignmutjzJ#RakshaBandhan #LaalSinghChaddha #AkshayKumar #AamirKhan #Bollywood pic.twitter.com/9gON2Eo4LG