వైద్య చికిత్సల కోసం సింగపూర్కు లాలూ

వైద్య చికిత్సల కోసం సింగపూర్కు లాలూ

దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాద‌వ్  వైద్య చికిత్సల నిమిత్తం సింగ‌పూర్  వెళ్లనున్నారు. వైద్యపరమైన కారణాలతో పాస్‌పోర్టును విడుదల చేయాలని కోరుతూ లాలూ ..  సెప్టెంబర్ 13న సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ముందుగా  సీబీఐ అభ్యంత‌రాల‌ను తోసిపుచ్చిన రాంచీలోని ప్రత్యేక న్యాయస్థానం లాలూ పాస్‌పోర్ట్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో లాలూ విదేశీ సింగ‌పూర్ పర్యటనకు మార్గం సుగ‌మమైంది.

లాలూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, సెప్టెంబర్ 24న సింగపూర్‌లో నెఫ్రాలజిస్ట్, స్పెషలిస్ట్‌తో అపాయింట్‌మెంట్ తీసుకున్నారని ఆయన లాయర్ అనంత్ కుమార్ విజ్ తెలిపారు. అంతకుముందు జూన్ 14న లాలూ ప్రసాద్ యాదవ్ పాస్‌పోర్ట్ రెన్యూవల్ కోసం విడుదల చేయాలని ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశించింది.