
హైదరాబాద్ సిటీ, వెలుగు: హాథీరామ్ బావాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని పీఠాధిపతిగా బంజారాబిడ్డను నియమించాలనే డిమాండ్తో ఈ నెల 29, 30 తేదీల్లో చలో తిరుపతి చేపట్టామని, దీనికి పెద్ద సంఖ్యలో బంజారాలు తరలిరావాలని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ పిలుపునిచ్చారు.
8 అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో సంజీవ్ నాయక్ ఆదివారం మాట్లాడారు. బంజారాజాతి గురువు హథీరామ్ బావాజీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది లంబాడీల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ లంబాడీలకు మంత్రిపదవి ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.