తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీపై కేంద్రం చిన్నచూపు
ట్రైబల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు, వెలుగు : ములుగులో ఏర్పాటు చేయాల్సిన ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సవతితల్లి ప్రేమ చూపుతోందని, ఇప్పటికే 169 ఎకరాల భూమిని అప్పగించినా బిల్డింగుల నిర్మాణం స్టార్ట్చేయడంలేదని ట్రైబల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఏపీలో యూనివర్సిటీ ప్రారంభించి.. ఒక సెమిస్టర్ కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పారు. గురువారం ములుగు మండలం జాకారంలో వైటీసీని సందర్శించిన ఆమె.. యూనివర్సిటీ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. యూనివర్సిటీపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ కోసం 350ఎకరాలను రెడీ చేశామని, అందులో అసైన్డ్ రైతుల నుంచి కొంత భూమి సేకరించవలసిఉందని, సంబంధిత రైతుల డిమాండ్లపై చర్చిస్తున్నామని వివరించారు. ములుగులో పనులు పనులు మొదలు పెట్టి టెంపరరీగాక్లాసులు ప్రారంభించాలని కోరారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ యూనివర్సిటీ అంశాన్ని తమ పార్టీ ఎంపీలు లేవనెత్తుతారని చెప్పారు. అంతకు ముందు ఆమె మల్లంపల్లిలోని విలేజ్ పార్క్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు చీరెలను పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు తెరుస్తున్నందున ఎడ్యుకేషన్ ఆఫీసర్లతో ఏర్పాట్లపై రివ్యూ చేశారు. ఐటీడీఏ పీవో హన్మంతు కె జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి, ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య, జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?
హఫీజ్పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు
చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!
ఫేస్ బుక్-వాట్సప్లలో చర్చిస్తారు.. ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తారు