బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై భూకబ్జా కేసు..

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై భూకబ్జా కేసు..

 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. భూపాలపల్లి జిల్లాలోని కోంపల్లి గ్రామంలో శిఖం భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టారని గండ్ర వెంకటరమణారెడ్డి పై నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 386, 406, 409, 420, 447, 506 తదితర సెక్షన్లలో కేసు నమోదు చేశారు.