
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఊసూరు బ్లాక్లోని కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకుని మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న ఎస్టీఎఫ్ జవాన్లు నక్సల్స్ అమర్చిన మందుపాతరపై కాలు మోపారు.
తాన్ సింగ్, అమిత్పాండే అనే ఇద్దరు జవాన్ల కాళ్లకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని బేస్ క్యాంపునకు తరలించి ప్రథమ చికిత్స అందించి, హెలిక్యాప్టర్ లో బీజాపూర్కు తీసుకెళ్లారు. కర్రెగుట్టల్లో అడుగడుగునా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు భద్రతాబలగాలకు సవాల్గా మారాయి.