హెచ్ఎంటీ, ఐడీపీఎల్ భూములు కబ్జా

హెచ్ఎంటీ, ఐడీపీఎల్ భూములు కబ్జా

గవర్నర్​కు బీజేపీ నేత మల్లారెడ్డి ఫిర్యాదు


హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీజేపీ నేత మల్లారెడ్డి విమర్శించారు. మంగళవారం మల్లారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు గవర్నర్ తమిళిసైని కలిసి ఈ కబ్జాలపై ఫిర్యాదు చేశారు. 

మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ..హెచ్ఎంటీ, ఐడీపీఎల్ తో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రస్తుతం వినియోగంలో లేని భూములను ఆక్రమించుకుంటున్నారన్నారు. అవి కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్​ను కోరినట్లు చెప్పారు. హెచ్ఎంటీ కి సంబంధించి 50 ఎకరాలు, ఐడీపీఎల్ కు సంబందించి 100 ఎకరాలు కబ్జాకు గురయిందని తెలిపారు.