
తిరువనంతపురంలో భారత్, శ్రీలంక మధ్య జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్లో ఆందోళనకర పరిస్థితి చోటుచేసుకొంది. సరిగ్గా సెంచరీకి 6 పరుగులు దూరంలో ఉన్న విరాట్ కోహ్లీ.. కరుణరత్నె బౌలింగ్లో బౌండరీ కొడతాడు. డీప్ స్క్వేర్, డీప్ మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్లు వాండర్సే, అషేన్ బండారా ఫోర్ని ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో డైవ్ చేసిన ఇద్దరు ఒకరినొకరు ఢీ కొని మైదానంలో కుప్పకూలారు. వెంటనే ఇద్దరు మైదానాన్ని విడిచారు.
గాయపడ్డ ఆటగాళ్లను స్ట్రెచర్పై పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లారు. బండారాకు మోకాలికి గాయం కాగా, వాండర్సేకు మెడకు గాయం అయింది. ఇద్దరిని స్నానింగ్ కోసం హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉంది. గాయపడ్డ ఆటగాళ్లకు టీమిండియా మెడికల్ టీం కూడా సాయం అందించింది.