- కరోనా బారిన పడి చనిపోయిన వారిని శ్మశానవాటిక తరలించేందుకు
హైదరాబాద్: కరోనా బారినపడి చనిపోయిన వారిని శ్మశానవాటికకు చేర్చేందుకు ఫీడ్ ద నీడీ సంస్థ మొదలుపెట్టిన లాస్ట్ రైడ్ సర్వీస్ను రాచకొండ సి.పి. మహేష్ భగ్వత్ శనివారం ప్రారంభించారు. ప్రతీరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల ఈ వాహనం అందుబాటులో ఉటుందని సి.పి చెప్పారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తరలించాలనుకునే వారు 7995404040 లేదా రాచకొండ కోవిడ్ కంట్రోల్ సెంటర్ నంబర్ 9490617234కు ఫోన్ చేయాలని అన్నారు.