
ఆపరేషన్ సిందూర్ రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న పాకిస్థాన్ భూభాగంలో.. గతంలో భారత్ చెప్పినదాని కంటే ఎక్కువ ప్రాంతాలపై దాడులు చేసినట్లు పాకిస్థాన్ రహస్య పత్రాలు బయటపెట్టగా.. ఇవాళ మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
భారత సాయుధ బలగాలు చేసిన దాడిలో పాక్ కి చెందిన ఆరు యుద్ద విమానాలు ధ్వంసమైనట్లు తెలిసిందే. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ నష్టాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. భారత దాడిలో పాక్ 6 యుద్ధ విమానాలతోపాటు.. 2 సర్వేలెన్స్ విమానాలను కోల్పోయినట్లు తేలింది. దీనికి తోడు సి-130 కార్గో విమానాన్ని కూడా పాక్ నష్టపోయినట్లు వెల్లడైంది. వాస్తవానికి ఇండియా ఆపరేషన్ సిందూర్ కింద మెుదటగా ఉగ్రవాదులు నక్కిన స్థావరాలపై మాత్రమే దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్, పాకిస్థాన్ లోపలి స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
అయితే తాజా సర్వాల సమాచారం ప్రకారం పాకిస్థాన్ బయటకు చెప్పుకుంటున్న దాని కంటే ఎక్కువే నష్టపోయినట్లు తెలుస్తోంది. ఒక సర్వే విమానం భారత సుదర్శన చక్ర మిస్సైళ్లకు కూలిపోగా.. మరొకటి స్వీడన్ ఆధారిత ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ బేసులో ఉన్న సమయంలో జరిగిన దాడులకు ధ్వంసం అయినట్లు తేలింది.
భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై దాడులు చేసిన సమయంలో హ్యాంగర్లలో ఉన్న యుద్ధ విమానాలు ఉన్నట్లు వెల్లడైంది. బొలారిపై చేసిన దాడిలో ఎన్ని విమానాలు పాక్ కోల్పోయిందనే విషయాలను బయటపెట్టలేదు. అలాగే యుద్ధం సమయం నాటి శకలాలను సైతం ఇప్పటికీ పాక్ క్లీన్ చేయలేదని తెలుస్తోంది. అంటే ఈ దాచిపెట్టిన నష్టాలను కూడా కలుపుకుంటే పాక్ కోలుకోలేని చావుదెబ్బతిందని యుద్ధ నిపుణులు అంచున్నారు.
దాడి సమయంలో పాక్ యుద్ధ విమానాలు భారత రాడార్ వ్యవస్థల్లో నుంచి మాయం కావటం చూస్తుంటే అడి దాడి వల్ల కుప్పుకూలాయని ప్రాథమికంగా తెలుస్తోంది. ఇండియా ఈ దాడుల్లో ఎక్కువగా క్రూయిజ్ మిసైళ్లను మాత్రమే ఎక్కువగా వినియోగించిందని వెల్లడైంది. ఇదే క్రమంలో చైనాకు చెందిన యూఏవీలను సైతం ఇండియా సమర్థవంతంగా గాల్లోనే కూల్చేయగలిగింది. మెుత్తానికి భారత అంచనాల ప్రకారం పాక్ 10 కంటే ఎక్కువ యుద్ధ విమానాలను ఆపరేషన సిందూర్ సమయంలో కోల్పోయిందని తెలుస్తోంది. ఇప్పటికీ యుద్ధం నాటి డేటా అనలసిస్ చేస్తున్నందున పూర్తి వివరాలు తెలియటానికి మరింత సమయం పట్టనుంది.