అమెరికాలో గ్యాంగ్‌‌వార్‌‌‌‌.. లారెన్స్‌‌ బిష్ణోయ్‌‌ అనుచరుడు హతం

అమెరికాలో గ్యాంగ్‌‌వార్‌‌‌‌.. లారెన్స్‌‌ బిష్ణోయ్‌‌ అనుచరుడు హతం

ఇండియానా: అమెరికాలో జరిగిన గ్యాంగ్‌‌వార్‌‌‌‌లో గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ లారెన్స్‌‌ బిష్ణోయ్‌‌ కీలక అనుచరుడు చనిపోయాడు. మృతుడిని హర్యానాకు చెందిన వీరేందర్‌‌‌‌ సంభిగా గుర్తించారు. ఇతడు బిష్ణోయ్‌‌కి అత్యంత సన్నిహితుడని దర్యాప్తు అధికారులు తెలిపారు. 

సోమవారం అమెరికాలోని ఇండియానా స్టేట్‌‌లో జరిగిన ఈ గ్యాంగ్‌‌వార్‌‌‌‌లో బిష్ణోయ్‌‌ అనుచరుల్లో మరొకరికి బులెట్‌‌ గాయాలయ్యాయి. దాడి జరిపిన కొద్ది గంటల తర్వాత రోహిత్‌‌ గోదారా నేతృత్వంలోని రైవల్‌‌ గ్యాంగ్‌‌ ఈ ఘటనపై స్పందించింది. తామే బిష్ణోయ్‌‌ మనిషిని చంపేశామని చెప్పింది. 

తన గ్యాంగ్‌‌కు చెందిన బల్జోత్‌‌ సింగ్‌‌, జస్సా అనే ఇద్దరు గ్యాంగ్‌‌స్టర్లు వీరేందర్‌‌‌‌ సంభిని చంపేశారని ఫేస్‌‌బుక్‌‌ ద్వారా ప్రకటించింది. ‘‘లారెన్స్‌‌ బిష్ణోయ్‌‌ పెద్ద ద్రోహి. చూస్తుండండి.. అతడికి మరెన్నో సర్‌‌‌‌ప్రైజ్​లిస్తం” అని బల్జోత్‌‌ సింగ్‌‌ పోస్ట్‌‌ పెట్టాడు.