
ఎల్బీనగర్, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్లో ఉంటున్న మహ్మద్ అఫ్రోజ్ (34) బంజారాహిల్స్లోని ఐఎస్బీఎన్ అనే సంస్థలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు సప్లయ్ చేస్తున్న ఢిల్లీకి చెందిన అషు అలియాస్ సద్దాంతో పరిచయం పెంచుకున్నాడు. అఫ్రోజ్, సద్దాం ఇద్దరూ కలిసి ఎడ్యుకేషన్ డిస్ కంటిన్యూ చేసి డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్స్ అవసరం ఉన్న వారిని టార్గెట్ చేసేవారు. ఒక్కో సర్టిఫికెట్కు సుమారు రూ. 3 లక్షలు తీసుకొని వారికి ఫేక్ సర్టిఫికెట్ అందించేవారు.
విదేశాలకు ఎడ్యుకేషన్ వీసా, వర్కింగ్ వీసాపై వెళ్లే వారికి డిగ్రీ పాసైనట్టుగా బీటెక్, డిగ్రీ ఇంటర్ , టెన్త్ సర్టిఫికెట్లను అమ్మేవారు. ఫేక్ సర్టిఫికెట్ల దందా గురించి సమాచారం అందుకున్న పోలీసులు మొదట మహ్మద్ అఫ్రోజ్ను అదుపులోకి తీసుకున్నారు.అతడి దగ్గరి నుంచి సర్టిఫికెట్లు కొన్న
Also Raed :-మళ్లీ తెరమీదకు యావర్ రోడ్డు విస్తరణ
సికింద్రాబాద్ చెందిన కడారి మణికంఠ, రాయదుర్గం చెందిన ఏలేటి రత్న కిశోర్, మహబూబ్ నగర్కు చెందిన షాబాజ్ అలీ ఖాన్, కీసరకు చెందిన సుశీల్ కుమార్, బాలానగర్ చెందిన ఔషర్ల బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి వివిధ వర్సిటీలకు చెందిన బీటెక్, డిగ్రీ టెన్త్ బోర్డుల ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అషు అలియాస్ సద్దాం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.