జయశంకర్భూపాలపల్లి/ నెల్లికుదురు/ పర్వతగిరి/ వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులకు పలువురు ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పలువురు సర్పంచ్ అభ్యర్థుల ప్రచారంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.
అంతకుముందు క్యాంప్ ఆఫీస్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయా గ్రామాల సర్పంచ్లను సన్మానించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచిరాజుపల్లి, ఎర్రబెల్లి గూడెం, కాచికల్, రామన్నగూడెం, బ్రాహ్మణ కొత్తపల్లి, నైనాల, రతి రామ్ తండాతోపాటు పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రచారం చేశారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపెల్లి, అనంతారం, వడ్లకొండ, రోళ్లకల్లు, నారాయణపురం, శ్రీనగర్, పెద్దతండా, అన్నారం, రావూర్, పర్వతగిరి గ్రామాల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మద్దతుదారుల తరఫున ప్రచారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున రాష్ర్ట కో ఆపరేటీవ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు ప్రచారం చేశారు. పార్టీ తరఫున నిలిపిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

