ఉద్యమకారులకే బీఆర్‌‌‌‌ఎస్ టికెట్​ కేటాయించాలి

ఉద్యమకారులకే బీఆర్‌‌‌‌ఎస్ టికెట్​ కేటాయించాలి

బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ బీఆర్‌‌‌‌ఎస్ టికెట్‌‌ను తెలంగాణ ఉద్యమకారులకే  ఇవ్వాలని గోషామహల్ ట్రేడర్స్ అసోసియేషన్ నేతలు సీఎం కేసీఆర్‌‌‌‌ ను కోరారు.  హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో  శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్లైవుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్‌‌ రెడ్డి మాట్లాడుతూ...  ఉద్యమకారుడు బిజిని శ్రీనివాస్ కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కోరారు. 

గోషామహల్ టికెట్ శ్రీనివాస్​కు   ఇస్తే ఆయన్ను గెలిపిస్తామని స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో గోషామహల్ ట్రేడర్స్ అసోసియేషన్ నాయకులు రమేశ్ అసోవా, దినేశ్ బండారీ,  ప్రసాద్, ఎం. కృష్ణ , ప్రవీణ్ గుప్త , రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.