హిమాచల్‌లో ముందంజలో స్వతంత్ర అభ్యర్థులు

హిమాచల్‌లో ముందంజలో స్వతంత్ర అభ్యర్థులు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముగ్గురు  స్వతంత్ర్య అభ్యర్థులు  ముందంజలో ఉన్నారు.  వీరిలో కేఎల్ ఠాకూర్, హోషియార్ సింగ్, హితేశ్వర్ సింగ్  ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న పోలింగ్ జరిగింది. కాగా నేడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రసవత్తరమైన పోరు కొనసాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో టఫ్ ఫైట్ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ 27, కాంగ్రెస్ 38 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తే..  అది కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉండనుందని పలువురు భావిస్తున్నారు. మరో వైపు నుంచి ఆలోచిస్తే అత్యంత తక్కువ తేడాతో బీజేపీ వెనుకంజలో గనక ఉన్నట్టయితే స్వతంత్ర అభ్యర్థుల విజయం బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారనుందనే వార్తలూ వినిపిస్తున్నాయి.