వాహనదారులకు ప్రమాద బీమా చేయిస్తా : ఎమ్మెల్యే రఘునందన్​రావు

వాహనదారులకు ప్రమాద బీమా చేయిస్తా : ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: నియోజకవర్గంలోని డ్రైవింగ్​ లైసెన్స్​ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి వాహనదారుడికి ప్రమాద బీమా చేయిస్తానని ఎమ్మెల్యే రఘునందన్​రావు హామీ ఇచ్చారు. బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో డ్రైవింగ్​ లైసెన్స్​ కోసం దరఖాస్తు చేసుకున్న వాహనదారులకు లెర్నింగ్​ లైసెన్స్​ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లెర్నింగ్​ లైసెన్స్​ ఆరు నెలల పాటు కాల పరిమితి ఉంటుందని, డ్రైవింగ్​ లైసెన్స్​ దశలవారీగా అందజేస్తామని చెప్పారు. 

లైసెన్స్​ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రూ. 2 లక్షల ప్రమాద బీమా చేయిస్తానని చెప్పారు.అనంతరం బాధిత కుటుంబాలకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్​గౌడ్​, ఎస్ఎన్​చారి, కె. శుభాష్​రెడ్డి, భిక్షపతి, మంద అనిల్​ రెడ్డి, గాజుల భాస్కర్, అమర్, మధు సూదన్​ రెడ్డి, తొగుట రవి, సప్తగిరి, నేహాల్​ గౌడ్​ పాల్గొన్నారు.