దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ నార్వే చెస్ టోర్నమెంట్ లో తన జోరు కొనసాగిస్తున్నాడు. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాడు. సోమవారం (జూన్ 6న) జరిగిన క్లాసికల్ ఐదో గేమ్లో ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లెసన్ ను ఓడించాడు. ఈ విజయంతో ఆనంద్.. 10 పాయింట్లతో అగ్రస్థానంలోకి రాగా, కార్లెసన్ 9.5పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో తొలి మూడు రౌండ్లలో మాక్సిమ్ లాగ్రెవ్ (ఫ్రాన్స్), వెస్లిన్ తపలోవ్ (బల్గేరియా), విషీ వాంగ్ హోను(చైనా) ఓడించాడు. అయితే నాలుగో రౌండ్లో అమెరికా ఆటగాడు వెస్లీ సో చేతిలో ఓటమి చెందాడు.
https://twitter.com/ANI/status/1533676774965805056
మరిన్ని వార్తల కోసం..