
న్యూఢిల్లీ: దేశ క్రీడా పరిపాలనలో కొత్త శకానికి నాంది పలుకుతూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ప్రెసిడెంట్గా లెజెండరీ పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్ పర్సన్గా ఉన్న ఉష.. కొన్నేళ్లుగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వివిధ జాతీయ అవార్డుల కమిటీలో పని చేశారు. కానీ ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం మాత్రం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు జడ్జి లావు నాగేశ్వర రావు పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో ఉషకు ఆపోజిట్గా ఎవరూ బరిలోకి దిగలేదు. జాయింట్ సెక్రటరీ (ఫిమేల్), ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నలుగురు ఆర్డినరీ మెంబర్స్ కోసం త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు.