కోతి కోసం వెళ్లి చచ్చిపోయిన చిరుతపులి

కోతి కోసం వెళ్లి చచ్చిపోయిన  చిరుతపులి

ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి కరెంట్ షాక్ తో చిరుత మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఉన్న సిందేవాహి అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించింది.  అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఉన్న కోతిని చూసి  దానిని వేటాడేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి ఎక్కింది.  

ఈ క్రమంలో కరెంట్ షాక్ రావడంతో కోతితో పాటుగా చిరుతపులి కూడా మృతి చెందింది.  విషయం తెలుసుకున్న అటవీ విద్యుత్‌ శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విగతజీవులుగా పడి ఉన్న జంతువులను కిందకు దించారు.