లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని మెంగారం శివారులో చిరుత పులి సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున లింగంపేటకు చెందిన సాజిద్ తన స్నేహితుడితో కలిసి బైక్పై కామారెడ్డి, -ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వెళ్తున్నాడు.
అదే సమయంలో రోడ్డు దాటుతున్న చిరుతను వారు గమనించి వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్చేశాడు. దీంతో చిరుత సంచారం న్యూస్ వైరల్గా మారింది. గతేడాది నవంబర్30న మెంగారం శివారులో చిరుత కన్పించింది. రెండు నెలలుగా మెంగారం శివారులో సంచరించడంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
