మెంగారం శివారులో చిరుత సంచారం

మెంగారం శివారులో చిరుత సంచారం

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలంలోని మెంగారం శివారులో చిరుత పులి సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున లింగంపేటకు చెందిన సాజిద్ తన స్నేహితుడితో కలిసి బైక్​పై కామారెడ్డి, -ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వెళ్తున్నాడు. 

అదే సమయంలో రోడ్డు దాటుతున్న చిరుతను వారు గమనించి వీడియో తీసి సోషల్​మీడియాలో పోస్ట్​చేశాడు. దీంతో చిరుత సంచారం న్యూస్ వైరల్​గా మారింది. గతేడాది నవంబర్​30న మెంగారం శివారులో చిరుత కన్పించింది. రెండు నెలలుగా  మెంగారం శివారులో సంచరించడంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.