ఎల్ బీనగర్, వెలుగు:‘మన ఊరు – మన బడి’లో భాగంగా గవర్నమెంట్స్కూళ్లను కార్పొరేట్కు దీటుగా తయారు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ క్లాస్ రూములు నిర్మిస్తున్నామని, టాయిలెట్స్, వంట గది, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నామని అంటున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం వెంకటేశ్వరకాలనీ ప్రైమరీ స్కూల్ స్థానిక కమ్యూనిటీ హాల్బిల్డింగ్లో కొనసాగుతుండగా, ప్రస్తుతం100 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఒకటో తరగతిలో 30 మంది, రెండులో 25, మూడులో17, నాలుగులో 15, ఐదో తరగతిలో 13 మంది చిన్నారులు ఉన్నారు. వీరి కోసం నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు.
అయితే ఇంత మందికి కలిపి క్లాస్రూములు రెండే ఉన్నాయి. 1 నుంచి 3 తరగతులను గ్రౌండ్ ఫ్లోర్ రూమ్లో, 4, 5 తరగతులను పై ఫ్లోర్లో ఉన్న రూమ్ లో కొనసాగిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ రూమే.. స్టాఫ్ రూమ్కూడా. ఇరుకు గదుల్లోనే టీచర్లు 100 మంది చిన్నారులకు పాఠాలు చెబుతున్నారు. అందరినీ ఒకేచోట కూర్చోబెట్టడంతో టీచర్లు చెప్పేది పిల్లలకు అర్థం కావడం లేదు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి స్కూల్ను మరో చోటుకు మార్చాలని, సపరేట్క్లాస్రూమ్ లు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వేలకు వేలు ఫీజులు కట్టలేక తమ పిల్లలను సర్కార్బడికి పంపిస్తున్నామని, అధికారులు పట్టించుకోకపోతే ఎలా అని వాపోతున్నారు. కమ్యూనిటీ హాల్ కు వచ్చిపోయేవారితో పిల్లలు డిస్ట్రబ్అవుతున్నారని
చెబుతున్నారు.