15 నుంచి రాష్ట్రపతి నిలయంలో లిబరేషన్ సెలబ్రేషన్స్

15 నుంచి రాష్ట్రపతి నిలయంలో లిబరేషన్ సెలబ్రేషన్స్

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 15 నుంచి 17 వరకూ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్ లిబరేషన్ సెలబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తామని భవన్ మేనేజర్, డాక్టర్  కె.రజని ప్రియ తెలిపారు. ఈ మూడ్రోజులు వివిధ సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. 

అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని, ఈ నెల 14వ తేదీలోగా రాష్ట్రపతి నిలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అందరూ కార్యక్రమాలను వీక్షించవచ్చని పేర్కొన్నారు.