
గచ్చిబౌలి, వెలుగు: భార్యను చంపిన భర్తకు రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. సైబరాబాద్ సీసీఎస్ఏడీసీపీ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్మండలం అన్నారం అనుబంధ గ్రామమైన గుండియా తండాకు చెందిన జటావత్రమేశ్(36), లలిత(30) భార్యాభర్తలు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెండ్లయిన కొన్నాళ్లు కాపురం సాఫీగా సాగగా, తర్వాత అదనపు కట్నం తేవాలని రమేశ్భార్యను వేధించసాగాడు. 2020 అక్టోబర్30న రాత్రి 11 గంటల సమయంలో మరోసారి గొడవపడ్డాడు. ఈ క్రమంలో కత్తితో లలితపై దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచాడు. స్థానికులు గమనించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2020 నవంబర్5న లలిత మృతి చెందింది. లలిత తండ్రి పత్లావత్ పీరి ఫిర్యాదుతో షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నవంబర్9న రమేశ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. షాద్నగర్పోలీసులు 90 రోజుల్లో చార్జ్షీట్ఫైల్ చేశారు. శుక్రవారం కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు 9వ అడిషనల్జడ్జి నిందితుడు రమేశ్కు జీవిత ఖైదు, రూ.25వేలు ఫైన్ విధిస్తూ తీర్పు వెల్లడించారు.