వరకట్నం కేసులో ..వ్యక్తికి జీవిత ఖైదు

వరకట్నం కేసులో ..వ్యక్తికి జీవిత ఖైదు

నారాయణపేట, వెలుగు: వరకట్న వేధింపులతో భార్య మరణానికి కారణమైన భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్​ జడ్జి ఎండీ రఫీ తీర్పు చెప్పారు. లైజన్​ ఆఫీసర్​ బాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. 2003లో మక్తల్​కు చెందిన చంద్రశేఖర్​గౌడ్​తో తాండూర్​కు చెందిన రాజేశ్వరి(24)తో వివాహం జరిగింది. 2005 ఫిబ్రవరి 16న రాజేశ్వరి వరకట్న వేధింపులతో చనిపోయిందని, మృతురాలి తండ్రి పండిత్​ రాజ్​గౌడ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పెండ్లి అయిన ఆరు నెలల నుంచి అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించడంతోనే చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పటి ఎస్ఐ శ్రీనివాస్​రావు కేసు నమోదు చేయగా, సీఐ సుబ్బరాయుడు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్​ దాఖలు చేశారు. అడిషనల్​ పీపీ ఎస్​ మురళీకృష్ణ కోర్టులో 12 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.