న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా– ఏఐఏ), టాటా ఏఐఏ రైజింగ్ ఇండియా ఫండ్ను ప్రారంభించింది. న్యూ ఫండ్ ఆఫరింగ్ (ఎన్ఎఫ్ఓ) మార్చి 31, 2024 వరకు తెరిచి ఉంటుంది. యూనిట్లను నెట్అసెట్ వాల్యూ (ఎన్ఏవీ) విధానంలో కేటాయిస్తారు. ఎన్ఎఫ్ఓ కాలంలో యూనిట్ ధర రూ. 10 ఉంటుంది. రైజింగ్ ఇండియా ఫండ్ ఆత్మనిర్భర్ భారత్ పరిధిలోని కీలక రంగాల్లో
కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. వీటిలో మౌలిక సదుపాయాలు, తయారీ, బ్యాంకింగ్, డిజిటల్, రక్షణ మొదలైనవి ఉన్నాయి. ఈ ఫండ్ లోని 70శాతం-–100శాతం పెట్టుబడులను ఈక్విటీ, ఈక్విటీ-సంబంధిత సాధనాలలో పెడతారు. 30శాతం వరకు డెట్ మనీ మార్కెట్ సాధనాలలో ఇన్వెస్ట్ చేస్తారు.