నేనూ పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : వీరేందర్ సింగ్‌‌‌‌

 నేనూ పద్మశ్రీ  వెనక్కి ఇచ్చేస్తా : వీరేందర్ సింగ్‌‌‌‌

న్యూఢిల్లీ :  బ్రిజ్‌‌‌‌ భూషణ్‌‌‌‌కు సన్నిహితుడు సంజయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌‌‌ఐ) ప్రెసిడెంట్‌‌‌‌గా ఎన్నికవడంపై నిరసన వ్యక్తం చేసిన ఇండియా స్టార్ రెజ్లర్లకు పారా(డెఫ్​) రెజ్లర్  మెడలిస్ట్ వీరేందర్ సింగ్‌‌‌‌ మద్దతు ప్రకటించాడు. బజ్‌‌‌‌రంజ్‌‌‌‌ పునియా మాదిరిగా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇస్తానని ప్రకటించాడు. 

సంజయ్‌‌‌‌ ఎన్నికకు నిరసనగా కెరీర్‌‌‌‌‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌ ప్రకటించిన స్టార్ రెజ్లర్‌‌‌‌‌‌‌‌ సాక్షి మాలిక్‌‌‌‌ను చూసి గర్విస్తున్నానని డెఫ్‌‌‌‌లింపిక్స్‌‌‌‌ గోల్డ్ మెడలిస్ట్ వీరేందర్ చెప్పాడు. తన సోదరి, ఈ దేశ పుత్రిక అయిన సాక్షి కోసం పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నానని ట్వీట్ చేశాడు. సచిన్ టెండూల్కర్, నీరజ్‌‌‌‌ చోప్రా వంటి లెజెండరీ అథ్లెట్లు ఈ విషయంపై స్పందించాలని కోరాడు.