మర్కజ్ కు వెళ్లొచ్చిన వాళ్లలో 400 మందికి కరోనా

మర్కజ్ కు వెళ్లొచ్చిన వాళ్లలో 400 మందికి కరోనా

న్యూఢిల్లీ: తమిళనాడులో గురువారం ఒక్కరోజే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 74 మంది తబ్లిగి జమాత్ సమావేశాల్లో పాల్గొని వచ్చినవారే. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 309కి చేరింది. వీరిలో మొత్తం 264 మంది ఢిల్లీలోని మర్కజ్ మసీదులో సమావేశాలకు వెళ్లినోళ్లే. దేశంలో 400 మంది పేషెంట్లకు ‘మర్కజ్’తో లింకు ఉన్నట్లు ఆఫీసర్లు చెప్పారు.

9,000 మంది తబ్లిగి సభ్యుల క్వారంటైన్

మర్కజ్ మసీదులో తబ్లిగి జమాత్ సమావేశాలకు హాజరైన వాళ్లు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్ మొత్తం 9 వేల మందిని క్వారంటైన్ కు తరలించారు. రాష్ట్రాల సహకారంతో వీరిని గుర్తించి, పర్యవేక్షణలో ఉంచారు. దీనిపై ఢిల్లీలో కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యసలీల శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో 2 వేల మంది తబ్లిగి సభ్యులను క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. వీరిలో 1,804 మందిని క్వారంటైన్లకు, కరోనా లక్షణాలున్న 334 మందిని హాస్పిటళ్లకు తరలించామన్నారు. దేశంలో 1,306 మంది, ఢిల్లీలో 250 మంది ఫారినర్లను గుర్తించామని చెప్పారు.

400 పేషెంట్లకు ‘మర్కజ్’ లింకు

దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 400 వరకు  ‘మర్కజ్’తో సంబంధం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. మర్కజ్ తో సంబంధం ఉన్న కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. తమిళనాడులో 264 పాజిటివ్ కేసులకు మర్కజ్ లింకు ఉన్నట్లు తేలిందన్నారు. ఢిల్లీలో 152 కేసులు నమోదు కాగా, 53 మంది (35%)కి మర్కజ్ తో లింక్ ఉన్నట్లు తేలింది. తెలంగాణలో 33, ఏపీలో 67 మంది కూడా మర్కజ్ కు వెళ్లొచ్చారన్నారు.

దేశంలో ఒక్కరోజే 329 కేసులు

దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 329 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 81, తమిళనాడులో 75 కొత్త కేసులు కన్ఫమ్ అయ్యాయి. ముంబైలో ఏడుగురు మరణించారు. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 16కు చేరింది. కేసులు 338కి పెరిగాయి. అస్సాంలో బుధవారం రాత్రి కొవిడ్ వల్ల తొలిసారి ఒకరు చనిపోయారు. ఈ మరణానికీ మర్కజ్ లింకు ఉన్నట్లు అధికారులు చెప్పారు. దేశంలో గత 24 గంటల్లో 12 మంది చనిపోయారు.

ఢిల్లీలో 10 వేల బలగాలు మోహరింపు

ఢిల్లీలో భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే ఉన్న బలగాలకు తోడు 100 సీఏపీఎఫ్ కంపెనీల బలగాలను మోహరించింది. 10 వేల అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 వరకూ వీరంతా నగరంలో సెక్యూరిటీ విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.

ప్లానింగ్ లేని లాక్ డౌన్