టొబాకో ఎంఆర్‌‌‌‌పీతో  జీఎస్​టీ సెస్ లింక్

టొబాకో ఎంఆర్‌‌‌‌పీతో  జీఎస్​టీ సెస్ లింక్

న్యూఢిల్లీ: పాన్ ​మసాలాతోపాటు  సిగరెట్లు వంటి టొబాకో ప్రొడక్టులపై వేస్తున్న జీఎస్​టీ సెస్ మాగ్జిమమ్​  రేటుపై క్యాప్ విధిస్తున్నట్టు  ప్రభుత్వం ప్రకటించింది. ఆయా ప్రొడక్టుల రిటెయిల్​ రేటుకు ఈ హయ్యస్ట్​ రేటును లింక్​ చేస్తున్నట్లు తెలిపింది. ఫైనాన్స్​ బిల్లుకు చేసిన సవరణలలో దీనిని ప్రతిపాదించారు. పాన్​మసాలా యూనిట్​(ప్యాకెట్​ లేదా వేరేదైనా) రిటెయిల్​ సేల్​ రేటుపై గరిష్టంగా 51 శాతం దాకా జీఎస్​టీ కాంపెన్సేషన్​ సెస్​ను ఈ సవరణ కింద విధించే వీలు కలుగుతుంది. ప్రస్తుతం  యాడ్ ​వాలోరమ్​ కింద 135 శాతం సెస్​గా విధిస్తున్నారు. ఇక సిగరెట్లపై ప్రతి వెయ్యి స్టిక్స్​కు రూ. 4,170 చొప్పున, అదనంగా యాడ్​ వాలోరమ్​ కింద రిటెయిల్​ రేటుపై 290 శాతం హయ్యస్ట్​ రేటుగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రొడక్టులపై 28 శాతం జీఎస్​టీ విధిస్తున్నారు. ఈ జీఎస్​టీకి అదనంగా సెస్​నూ విధిస్తారు. జీఎస్​టీ కాంపెన్సేషన్​ సెస్​ యాక్ట్​లో సంబంధిత సవరణలను తెచ్చారు. జీఎస్​టీ కాంపెన్సేషన్​ ఎంత అనేది కచ్చితంగా తెలియాలంటే,  జీఎస్​టీ కౌన్సిల్​ నోటిఫికేషన్​ వచ్చేదాకా వెయిట్​ చేయాల్సిందేనని ట్యాక్స్​ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. తాజా సవరణతో నోటిఫికేషన్​ ద్వారా రేట్లను మార్చే వీలు జీఎస్​టీ కౌన్సిల్​కి కలుగుతుంది. పాన్​మసాలా, టొబాకో ప్రొడక్టులపై ట్యాక్సేషన్​పద్ధతిలో ఇది చెప్పుకోదగ్గ మార్పేనని ఎనలిస్టులు పేర్కొన్నారు.