లిక్కర్, గుట్కా, గంజాయి తెస్తే కఠిన చర్యలు
గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు
సెక్యూరిటీ చెకింగ్లో దొరికిన మత్తు పదార్థాల కాల్చివేత
పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్ సెక్యూరిటీ చెకింగ్లో దొరికిన లిక్కర్, కల్లు బాటిళ్లను మంగళవారం హాస్పిటల్ డంపింగ్ యార్డు వద్ద కుప్పగా పోసి ధ్వంసం చేశారు. గుట్కా, సిగరెట్లు, జర్దా, బీడీలను కాల్చివేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ కోసం డైలీ 4 నుంచి 10 మంది వస్తున్నారని, అనుమతించకపోతే సెక్యూరిటీ గార్డులపై దాడులకు దిగుతున్నారని చెప్పారు.
ఇలా అటెండెంట్లు వందల్లో వస్తుండడం పెద్ద సమస్యగా మారిందని, ఇటీవల అటెండెంట్ల వద్దనే గంజాయి, లిక్కర్దొరికాయని చెప్పారు. హాస్పిటల్కు వచ్చే పేషెంట్లు, అటెండెంట్లు ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకురావద్దని సూచించారు. నిషేధిత పదార్థాలతో చెకింగ్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే గంజాయి, కత్తితో దొరికిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపామని ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపారు. ఆర్ఎంవోలు డా.జయకృష్ణ, డాక్టర్లు రాము, వెంకటరమణ, జీడీఎక్స్ సెక్యూరిటీ చీఫ్ శివాజీ, సిబ్బంది పాల్గొన్నారు.