మద్యం లారీ బోల్తా..ఎక్కడంటే..

 మద్యం లారీ బోల్తా..ఎక్కడంటే..

ప్రభుత్వ మద్యం లారీ బోల్తా పడిన ఘటన  కంచికచర్ల మండలం కీసరలో చోటుచేసుకుంది. విజయవాడ నుంచి జగ్గయ్య పేట వెళ్తున్న మద్యం లారీ ఒక్కసారిగా అదుపుతప్పి కీసర వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో  లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థల వద్దకు చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. బోల్తా పడిన లారీలో నుంచి మద్యం సీసాలను తీసుకు వెళ్ళటానికి ప్రజలు ఎగబడ్డారు.