నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లో 86.32 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,81,543 ఓట్లకు గానూ 1,56,710 ఓట్లు పోలైనట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. వెల్డండ మండలం కుప్పగండ్లలో బ్యాలెట్ పేపర్లో వార్డు సభ్యుడికి గుర్తు కేటాయించకపోవడంతో అరగంటపాటు పోలింగ్నిలిచిపోయింది.
కల్వకుర్తి మండలంలో 26,280, ఊర్కొండ మండలంలో 14,751, వెల్దండ మండలంలో 23,919, వంగూరు మండలంలో 26,857, తాడూరు మండలంలో 25,947, తెలకపల్లి మండలంలో 33,956 మంది ఓటు వేశారు. జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయం దాటిన తర్వాత క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
నాగర్కర్నూల్ జిల్లా కొత్త సర్పంచ్ల జాబితా:

