మాదాపూర్, వెలుగు: తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువును, జన్మనిచ్చిన భూమిని మర్చిపోయిన వాడు అసలు మనిషే కాడని మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సంగీతం సాత్విక స్వభావాన్ని, మంచి ఆలోచనని కలుగజేస్తుందన్నారు. ఆదివారం మాదాపూర్లోని శిల్పకళావేదికలో లిటిల్ మ్యూజిషియన్స్అకాడమీ సిల్వర్జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి.
మాజీ రాష్ట్రపతి, ఎమ్మెల్యే హరీశ్ రావు, చినజీయర్స్వామి, శోభా రాజు, వరప్రసాద్రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు కొమాండూరి రామాచారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.