అలాంటి వాడు మనిషేకాడు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అలాంటి వాడు మనిషేకాడు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మాదాపూర్, వెలుగు: తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువును, జన్మనిచ్చిన భూమిని మర్చిపోయిన వాడు అసలు మనిషే కాడని మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  సంగీతం సాత్విక స్వభావాన్ని, మంచి ఆలోచనని కలుగజేస్తుందన్నారు. ఆదివారం మాదాపూర్​లోని శిల్పకళావేదికలో లిటిల్ మ్యూజిషియన్స్​అకాడమీ సిల్వర్​జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి.   

మాజీ రాష్ట్రపతి, ఎమ్మెల్యే హరీశ్ రావు, చినజీయర్​స్వామి, శోభా రాజు, వరప్రసాద్​రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు కొమాండూరి రామాచారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.