జనగామ వ్యవసాయ మార్కెట్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్

జనగామ వ్యవసాయ మార్కెట్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్

జనగామ వ్యవసాయ మార్కెట్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.  రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై కేసులు పెట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.  రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని.. మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.