హామీల అమలులో ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్​ రెడ్డి

హామీల అమలులో ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్​ రెడ్డి

కోహెడ, వెలుగు : నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్​ హామీల అమలులో విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్​రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని చెంచల్​చేర్వుపల్లిలో ‘పల్లె పల్లెకు పవీణన్న.. గడప గడపకు కాంగ్రెస్’​ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హయాంలో ఐదేండ్లలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తే, ఇప్పటి ఎమ్మెల్యే ఒక్క డబుల్​ బెడ్​రూమ్​ ఇల్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు బస్వరాజు శంకర్, ధర్మయ్య, సుధాకర్, మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, కిషన్, నారాయణ  ఉన్నారు.