బంగారంపై తీసుకునే లోన్ను.. UPI యాప్స్ ద్వారా వాడుకోవచ్చు.. యాక్సిస్ బ్యాంక్ సదుపాయం

బంగారంపై తీసుకునే లోన్ను.. UPI యాప్స్ ద్వారా వాడుకోవచ్చు.. యాక్సిస్ బ్యాంక్ సదుపాయం

హైదరాబాద్​, వెలుగు: యాక్సిస్ బ్యాంక్, తన భాగస్వామి ఫ్రీచార్జ్​తో కలిసి ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా బంగారంపై తీసుకునే లోన్​ను డబ్బును నేరుగా గూగుల్​పే, ఫోన్​పే వంటి యూపీఐ యాప్స్​ ద్వారా వాడుకోవచ్చు. 

సాధారణంగా గోల్డ్ లోన్ తీసుకుంటే, ఆ డబ్బు కస్టమర్​ బ్యాంకు ఖాతాలో పడుతుంది.  ఈ విధానంలో డబ్బును ఓవర్​డ్రాఫ్ట్​ విధానంలో ఇస్తారు. దీనిని యూపీఐ ద్వారా వెంటనే ఉపయోగించవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ బంగారంపై అప్పు తీసుకొని, ఆ డబ్బును నేరుగా యూపీఐ చెల్లింపుల కోసం వాడుకోవచ్చు. 

ఈ విధానం పూర్తిగా డిజిటల్, అని బ్రాంచ్​కు వెళ్లకుండానే డబ్బు పొందవచ్చని యాక్సిస్​ తెలిపింది.   వాడుకున్న డబ్బుకు మాత్రమే వడ్డీ పడుతుంది. ఉదాహరణకు రూ.ఐదు లక్షల ఓడీలో రూ.50 వేలు వాడుకుంటే.. ఈ మొత్తానికే వడ్డీ కడితే చాలు.