బ్యాంకులోన్ కట్టలేదని ఓ మహిళా రైతు భూమి స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఆమె పొలంలో ఇలా ఫ్లెక్సీ పెట్టారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన శారదకు 2.29 ఎకరాల భూమి ఉంది. భూమి పేరుమీద మూడేళ్ల కింద బ్యాంకు నుంచి రూ.2.50 లక్షలు లోన్ తీసుకున్నారు. లోన్ కట్టకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. రైతు చెల్లించకపోవడంతో స్వాధీనం చేసుకుంటున్నట్లు బుధవారం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
– గంగాధర, వెలుగు