
కామారెడ్డి, వెలుగు : రాజంపేట మండలంలోని కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లిల మధ్య ఆర్అండ్బీ రోడ్డుపై వాగులకు అడ్డంగా 2 చోట్ల బ్రిడ్జిలు నిర్మించారు. బీటీ రోడ్డు వేయకపోవడంతో వాహనాల రాకపోకలతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షానికి నీళ్లు నిలిచి ప్రమాదకరంగా మారాయి.
ఈ మార్గంలో కామారెడ్డి నుంచి రాజంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు గ్రామాలతో పాటు, మెదక్ జిల్లాకు వాహనాల రాకపోకలు సాగుతాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించి బ్రిడ్జిల వద్ద గుంతలు పూడ్చి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.