లాక్ డౌన్: డబ్బులు సంపాదించుకోవచ్చు… ప్రాణాలు పొతే రావు

లాక్ డౌన్: డబ్బులు సంపాదించుకోవచ్చు… ప్రాణాలు పొతే రావు

హైదరాబాద్‌‌, వెలుగు: దేశంలో లాక్ డౌన్ మరికొద్ది రోజులు కొనసాగించాల్సిం దేనని.. కరోనాను ఎదుర్కొనేం దుకు అదొక్కటే ఆయుధమ ని సీఎం కేసీఆర్ అన్నరు. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 14 తర్వాత కూడా లాక్‌‌ డౌన్‌‌ కొనసాగాలని, ప్రధాని మోడీకి కూడా ఈ విషయం చెప్పానని అన్నారు. లాక్ డౌన్ ఎత్తేస్తే ఎవర్నీ ఆపలేని పరిస్థి తి ఉంటుందని చెప్పారు. ఆర్ధికంగా నష్టపోతే మళ్లీ పుంజుకోవచ్చని, ప్రాణాలు పోతే తీసుకురాలేమని స్పష్టం చేశారు. కేంద్రం లాక్ డౌన్ ఎత్తేసినా రాష్ట్రంలో కొనసాగిస్తామన్నారు. లాక్ డౌన్ తో ఆర్ధికంగా  ఇబ్బంది ఉంటుందని, అయినా పూర్తిస్థాయి లో కష్టపడి నిలదొక్కుకుం టామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థి తిపై సోమవారం ప్రగతి భవన్‌‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బోస్టన్‌‌ కన్సల్టెంగ్‌ గ్రూప్‌ చేసిన సర్వే ప్రకారం.. ఇండియాలో జూన్‌‌ 3 వరకు లాక్‌‌డౌన్‌‌ కొనసాగించాలే. లాక్‌‌డౌన్‌‌ లేకుంటే అప్పటివరకు ఇండియాలో కరోనా పీక్స్‌‌ వెళ్తుందని హెచ్చరిస్తున్నారు. మనలాంటి దేశానికి లాక్‌‌ డౌన్‌‌ పాటించడం తప్ప వేరే దారి లేదు.

ఇందులో కూడ వితండ వాదనలు చాలా ఉన్నాయి . ఎకానమీ దెబ్బ తింటదని. తినదా. మనకు రోజుకు రూ.400 కోట్ల రూ.430 కోట్ల దాకా రావాలే. ఈ లెక్కన ఇప్పటికే రూ.2,400 కోట్లు రావాలే.. కానీ రూ.6 కోట్లే వచ్చినయి. ఇది బాధాకరమే. మనలెక్క నే దేశం గతి కూడా ఉంటది. వేరే దేశాలతో పోల్చు కుంటే మనం నయమే కదా. లాక్‌డౌన్‌ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచే జరుగుతది. ఖుల్లా చేయాలనే అనుకుందాం. ఎవర్ని వదలాలే. మసీదులు, గుళ్లు, పబ్బులు, క్లబ్బులు.. అన్నీ తెరిస్తే అంతా బయటికి వస్తరు. ఎవర్నని ఆపుతం. లాక్‌డౌన్‌ పాటించుడు తప్ప మనకు గత్యం తరం లేదు. కరోనా బీమారికి మందులేదు. చచ్చిపోయేది ఎవరు? మన ప్రజలే కదా.. నేనైతే కంటిన్యూ చేయమనే ప్రధానికి అప్పీల్‌ చేస్తున్న..

పరిస్థితి దారుణంగాఉంది

కరోనా ఏ ఒక్కరో ఎదుర్కొంటు న్న సమస్య కాదు. యావత్‌ మానవజాతి ఎదుర్కొంటు న్న సంక్షోభం. 22 దేశాలు కంప్లీ ట్‌గా, 90 దేశాలు పాక్షికంగా లాక్డౌన్ చేసినయి. సింగపూర్‌ లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే వైరస్‌ విజృంభించింది. చైనాలోనూ పరిస్థితి తిరగ బెడుతోంది. అంటే పరిస్థి తి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో లాక్‌ డౌన్‌ పాటించినం కాబట్టే నాలుగు వేల కేసులతో ఆగిపోయింది. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశమే భయంకర పరిస్థి తిలో ఉంది. న్యూయార్క్‌లో  శవాల గుట్టలు ఉన్నయి. శవాలను రిఫ్రిజిరేటెడ్‌ ట్రక్కుల్ లో పంపుతున్నా రు. రెండు లక్షల మందికిపైగా చనిపోతరని వాళ్ల ప్రెసిడెంటే  చెప్తున్నరు. సికింద్రాబాద్‌లో ఒక మహిళ చనిపోతే ఆమె నలుగురు పిల్లలు అనాథలయ్యారు. పేపర్లో ఆ వార్త చదివితే నాకు కండ్లలో నీళ్లు తిరిగినయి. మరి లక్షలాది మంది చనిపోవడాన్ని ఊహించుకుంటేనే భయమైతున్నది.

లేట్ చేస్తే ప్రాణాలుపోతయి

కరోనా వైరస్‌ ఎక్కువగా ప్రబలిన వాళ్లే చనిపోతున్నరు. ముందే వస్తె ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మర్కజ్ కు వెళ్లొచ్చి నవాళ్లు వైరస్ ఓవర్ లోడ్ అయి చనిపోయా రు. కరోనాకు మందు లేదు. వైరస్‌ తీవ్రత తక్కువున్న వాళ్లకుకొన్ని మందులు ఇచ్చి ట్రీట్‌మెంట్‌ చేస్తున్నరు. రాష్ట్రంలో మందులకు కొరత లేదు. ఎక్కడైనా ఉంటే నేరుగా హెల్త్‌ మినిస్టర్‌, సీఎస్‌కు ఫోన్‌ చేయాలె. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ దేశానికి హైడ్రాక్సి క్లోరోక్విన్‌ పంపా లని అడిగితే.. మన ప్రధాని నిరాక రించారు.

16 వేల బెడ్స్ సిద్ధంగా ఉంచినం

కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ఎనిమిది నోటిఫైడ్‌ హాస్పి టళ్లు ఉంటె.. అందులో గాంధీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ట్రీట్‌మెంట్‌ విషయంలో ప్రభుత్వం కఠినం గానే ఉంటది. 16 వేల బెడ్స్‌రెడీగా ఉన్నయి. అత్యవస రమైతే 25 వేల మంది డాక్టర్లు, హెల్త్ సిబ్బందిని రెడీగా పెట్టుకున్నం . ప్రజల్లో, డాకర్టలో మనోధైర్యం కోల్పోయే ప్రచారం చేయొద్దు. అట్లాంటో ళ్లకు కరోనా రావాలె. తప్పుడు ప్రచారం చేస్తేశిక్ష తప్పది. అలాంటి వాళ్లకు తగిన ట్రీట్‌మెంట్‌ ఇస్తం. వాళ్లు ప్రజాద్రోహులు, ప్ర జలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి  దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నరు. కేసీఆర్‌ చెప్తున్నడంటే ఖతర్నాకే ఉంటది.

గన్నీ సంచుల యూనిట్లు పెడ్తం

ధాన్యం సేకరణకు ఇబ్బం దిగా ఉన్న గన్నీ సంచుల సమస్యను ప్రధాని మోడీకి వివరించిన. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ మాట్లాడినా . ఎఫ్‌సీఐకి ఇచ్చే ధాన్యం లో 50 శాతం గన్నీ సంచుల్లోనే ఇవ్వా లనే రూల్ ఉంది. అది ఎత్తేస్తే రాష్ట్రానికి సరిపడా ప్లాస్టిక్‌ సంచులు తయారు చేసే ఇండస్ట్రీస్‌ మన దగ్గ ర్నే ఉన్నయి. కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ, పాలమూరు, దేవాదుల పూర్తయితే వానాకాలంలో కోటి ఎకరాల్లో వరి పంట వస్తది. అట్లాంటప్పుడు ఇంకో రాష్ట్రం పై ఆధారపడకుండా మన దగ్గర్నే గన్నీ సంచుల పరిశ్రమలు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తు న్నం. ఈ సారియాసంగిలో ఫస్ట్‌టైం 40 లక్షల ఎకరాల్లో వరికోతలు మొదలవుతున్నయి. వైరస్‌లేకుంటే నేను డ్యాన్స్‌ చేసేవాడ్ని. ప్రాజెక్టులన్నీ కంప్లీట్‌ అయితే తెలంగాణ భారతదేశానికే ధాన్యాగారం అయితది. పరిశ్రమలు మూతపడి ఉపాధి కోల్పోయిన కార్మికు లను ఆదుకోవడంపై దృష్టి పెడుతున్నం.

చనిపోయినోళ్లంతా మర్కజ్‌తో లింకున్నోళ్లే..

విదేశాల నుంచి వచ్చిన 25,937 మందిని క్వారం టైన్ చేసినం. అందులో 30 మందికి కరోనా ఉంది, వారి నుంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్20 మంది సోకింది. వాళలో దాదాపు అందరూ వ్యాధినుంచి బయటపడ్డరు. ఫారిన్‌ నుంచి వచ్చినోళ్లందరి క్వారంటైన్ రెండు మూడు రోజుల్లో ముగుస్తది. వాళ్వలెరికీ ఇక కరోనా లేనట్టే. తెలంగాణలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ కాలేదు. ఢిల్లీ నిజాముద్దీన్నుంచి వైరస్ అంటినో ళ్లు లేకుంటే రాష్ట్రంలో కరోనా పీడనే ఉండేది కాదు. రాష్ట్రంలో చనిపోయిన 11 మందికి ఢిల్లీ నిజాముద్దీ న్ మర్కజ్‌తోలింక్‌ ఉంది. నేరుగా వెళ్లొచ్చి నవాళ్లో, వాళ్ల నుంచి  జబ్బు అంటినోళ్లో చనిపోయారు. నిజా ముద్దీన్‌ ఘటన దేశాన్ని అతలాకుతలం చేసింది. మనకూ ఆపీడ వచ్చి పడ్డది.  మర్కజ్ వెళ్లొచ్చిన 1,089 మంది, వారితో కాంటాక్ట్ అయిన 3,015 మందిని గుర్తించినం . ఇప్పటికి 172 మందికి వైరస్‌ వచ్చింది. వాళ్లనుంచి  ఇంకో 93 మందికి అంటింది. ఇంకా టెస్టులు చేయిస్తున్నం . బుధవారం సాయంత్రానికి రిపోర్టులు వస్తయి. మొత్తంగా ఇంకో నూరు, నూట యాభై మందితో వైరస్‌ ఆగిపోతుందని ఆశిస్తున్నం. రాష్ట్రం లో మర్కజ్‌కువెళ్లొచ్చి న వాళ్లు ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్చం దంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలె.

మర్కజ్కు వెళ్లొచ్చినోళ్లు బయటికి రావాలె

రాష్ట్రం నుంచి మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లెవరైనా ఉంటే స్వచ్ఛందంగా బయటికొచ్చి టెస్టు లు చేయించు కోవాలె. రాష్ట్రంలో  చనిపోయిన 11 మందికి మర్కజ్‌తోలింక్‌ ఉన్నది. వాళ్లంతా వైరస్ ఓవర్ లోడ్ అయి చనిపోయిన్రు. మర్కజ్కు పోయొచ్చిన 172 మందికి వైరస్ వచ్చిం ది, వాళ్ల నుంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇంకో93 మందికి సోకింది. ఈ వైరస్కు మందు లేదు. హాస్పిటల్లో ఉంచి వైరస్ లోడ్ పెరగకుండ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఇంకా ఎవరైనా ఉంటే బయటికి రావాలె. లేకుంటె వాళ్ల నుంచి ఇంట్లో వాళ్లకు, దగ్గరోళ్లకే వైరస్ వస్తది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతది.

హెల్త్‌, శానిటేషన్ సిబ్బందికి గిఫ్ట్

తమకు వైరస్‌ సోకుతుందని తెలిసీ వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. స్వీపర్‌ నుంచి హెల్త్‌ డైరెక్టర్‌ వరకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ప్రతి వీధిని శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కార్మికులకు పాదాభివందనం చేస్తున్నా. వైద్య సిబ్బందికి గ్రాస్ శాలరీలో పది శాతం సీఎం గిఫ్ట్‌కింద ఇస్తం. మున్సిపల్‌ శానిటరీ సిబ్బంది, వాటర్‌ బోర్డు కార్మికులు 94,392 మందికి కూడా గిఫ్ట్‌ ఇస్తం. గ్రేటర్‌ కార్పొరేషన్‌, వాటర్‌ బోర్డు సిబ్బందికి రూ.7,500 చొప్పున, మున్సిపల్‌, పంచాయతీ కార్మికులకు రూ.5 వేల చొప్పున వెంటనే అందజేస్తం. 60 వేల మంది పోలీసులు పగలూ రాత్రీ డ్యూటీ చేస్తున్నరు. వారికి ప్రోత్సాహం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.