GHMC కమిషనర్‌ గా లోకేష్‌ కుమార్

GHMC కమిషనర్‌ గా లోకేష్‌ కుమార్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(GHMC) కమిషనర్‌గా లోకేష్‌ కుమార్‌ను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం GHMC కమిషనర్‌ తో పాటు, జలమండలి కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న దాన కిషోర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది ప్రభుత్వం. ఇకపై ఆయన జలమండలి  కమిషనర్ గా మాత్రమే కొనసాగనున్నారు. ఇక రంగారెడ్డి జేసీగా పనిచేస్తున్న హరీశ్‌ కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.