
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చు వరల్డ్ రికార్డ్ అని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. డబ్బు రాజకీయాలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. బ్రిటన్ ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే.. తెలంగాణలో ఒక్క నియోజకవర్గంలో పెట్టిన ఖర్చు చాలా ఎక్కువ ఉందంటూ విష్మయం వ్యక్తం చేశారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని ప్రకటించినా ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. డబ్బులు పొందిన కుటుంబాలు కూడా ఓట్లు వేయలేదని ఆధారాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ అన్నారు. శాశ్వతంగా పేదరికాన్ని పోగేట్టేందుకు ఆ డబ్బులను ఖర్చు పెట్టాలని ఆయన చెప్పారు.