పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం కొనేది తెలంగాణలోనే

పంజాబ్ తర్వాత  అత్యధిక ధాన్యం కొనేది తెలంగాణలోనే

కేసీఆర్ భయపెడితే బీజేపీ కార్యకర్తలు ఎవరు బెదిరిపోరన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఢిల్లీలో ధర్నాలు చేస్తే.. వాయిస్ పెంచితే కేంద్రం భయపడదన్నారు. 2014లో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. 2021 లో తెలుగు రాష్ట్రాల నుంచి 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని  కేంద్రం సేకరించిందన్నారు. 2019–20లో తెలంగాణ నుంచి 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు. తెలంగాణలో 2014లో ధాన్యం సేకరణకు రూ. 3400 కోట్ల డబ్బును ఖర్చు పెట్టిందన్నారు. 2020, 21 లో రూ.26,646 కోట్లు సేకరణకు ఖర్చు పెడుతుందన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ధాన్యం సేకరణకు మిల్లింగ్ చార్జీలు, బ్యాగ్‌ లు,ట్రాన్ పోర్ట్ ఖర్చులు అన్ని లెక్క గట్టి కేంద్రమే ఖర్చులు భరిస్తుందన్నారు.

కేంద్రం పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యాన్ని తెలంగాణలో కొంటుందన్నారు. కేంద్రం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అత్యధికంగా పంజాబ్ లో 135 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. ఆ తర్వాత తెలంగాణలో 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. 2020, 21 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 600 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే. 94.54 శాతం ధాన్యాన్ని తెలంగాణను నుంచి సేకరిస్తోందన్నారు. దేశంలో బాయిల్డ్ రైస్ కు డిమాండ్ తగ్గిందన్నారు. తెలంగాణపై కేంద్రానికి బాధ్యత ఉందన్నారు.

ముఖ్యమంత్రి ప్రజలను రైతులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదన్నారు. బాయిల్డ్ రైస్ తెలంగాణా లో ఎవరు తినరన్నారు. కేరళలోను తినడం తగ్గించారన్నారు.  రైతులు బాయిల్డ్ రైస్ పండించరని....బాయిల్డ్ రైస్ తయారు చేసేది మిల్లర్లని... వినియోగించే పరిస్థితి లేనపుడు ప్రజా ధనం వృధా అవుతుందన్నారు. 2021 లోనే 20 లక్షల మెట్రిక్ టన్నులు  తీసుకోవాలని.. తదుపరి మిల్లర్ల సామగ్రి మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి  లేఖ రాసిందన్నారు.  భవిష్యత్తులో కేంద్రానికి దొడ్డు  బియ్యం పంపమని రాష్ట్రభుత్వం కూడా కేంద్రానికి లేఖ రాసిందన్నారు. రాష్ట్రంలో ఎంత ధాన్యం పండిస్తున్నారో ప్రభుత్వానికి అవగాహన లేదన్నారు. జీఎస్టీ మెరుగు పడటంతో పెట్రోల్,డీజిల్ రేట్లను కేంద్రం తగ్గించిందన్నారు.