లిఫ్ట్ ఇస్తానంటూ మహిళను నమ్మించి నగలు దోపిడీ 

లిఫ్ట్ ఇస్తానంటూ మహిళను నమ్మించి నగలు దోపిడీ 

ఆత్మకూరు, వెలుగు: లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, మహిళను కొట్టి నగదు దోపిడీ చేసిన ఘటన వరంగల్​ రూరల్​ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద జరిగింది. ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాల ప్రకారం.. రేగొండ మండలానికి చెందిన మహిళ మంగళవారం ఉదయం 11గంటలకు పరకాల వెళ్లేందుకు గూడెప్పాడ్ వద్ద బస్ ​కోసం వెయిట్​ చేస్తోంది. గీసుకొండ మండలం ఏలుకుర్తి గ్రామానికి చెందిన రాకేశ్ లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన టవేరా వెహికల్​లో ఎక్కించుకున్నాడు. పరకాల మండలం కామారెడ్డి పల్లె గ్రామ శివారులో వెహికల్​ ఆపి, మహిళను ఇనుపరాడ్డుతో కొట్టాడు. మెడలోని పుస్తెల తాడు, కమ్మలు, కాళ్ల పట్టీలు లాక్కున్నాడు. తీవ్ర గాయాలైన మహిళను హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ఎస్సారెస్పీ కెనాల్​లో పడేసి, పారిపోయాడు. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు 108​లో వరంగల్​ఎంజీఎంకు తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం నేషనల్ హైవేపై ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేసి, వెహికల్ నంబర్ ​ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. దొంగిలించిన సొత్తును బాధితులకు అప్పగించారు.