గ్రహణం రోజు ఆలయంలో విగ్రహాలను ఎత్తుకెళ్లిన మహిళ

గ్రహణం రోజు ఆలయంలో విగ్రహాలను ఎత్తుకెళ్లిన మహిళ

చిత్తూరు జిల్లాలో దొంగలు పేట్రేగిపోతున్నారు.  చంద్రగ్రహణం ఎఫెక్ట్​ దేవుళ్లకు   కూడా ఉంటుందా.. అంటే  ఘటనను పరిశీలిస్తే నిజమేనని అనిపిస్తుంది. ఐరాల మండలం ఓ దేవాలయంలో  అమ్మవారి విగ్రహం చోరీకి గురైంది. పాలేటమ్మ విగ్రహాన్ని మహిళ దొంగిలించిదని  పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.  దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మంత్రాలు చేసే ఓ మహిళ చిత్తూరు జిల్లా..  ఐరాల మండలంలోని పాలేటమ్మ విగ్రహాన్ని.. నలుగురు వ్యక్తుల సాయంతో   ఓ మంత్రగత్తె దొంగిలించిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన....  ఐరాల పోలీసులు ..ఆ మహిళతో సహా మిగతా నిందితులను తనంపల్లి మండలంలో పట్టుకున్నారు.  ఆ మహిళ మంత్రాలు చేసే మహిళ అని స్థానికులు ఆరోపిస్తున్నారు.