శివాలయంలో భక్తులకు దర్శనమిచ్చిన నాగుపాము

శివాలయంలో భక్తులకు దర్శనమిచ్చిన నాగుపాము

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మం. గొడిసెరాల రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. మహాశివరాత్రి సందర్భంగా స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు గర్భగుడిలో  పాము కనిపించింది. పూజలు చేస్తున్న సమయంలో పామును చూసిన భక్తులంతా శివుడే ప్రత్యక్షమయ్యాడని మొక్కులు మొక్కారు. చాలాసేపు ఆలయంలోనే కనిపించిన పాము కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రతీ ఏడాది మహాశివరాత్రి పర్వదినాన పాము ప్రత్యక్షమవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.