లారీని ఢీకొట్టిన డీసీఎం.. డ్రైవ‌ర్ మృతి

లారీని ఢీకొట్టిన డీసీఎం.. డ్రైవ‌ర్ మృతి

-ఔటర్ పై ఆగివున్న లారీని ఢీకొన్న డీసీఎం
-రావీర్యాల ఏక్సిట్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
-క్యాబిన్లో ఇరుక్కుని డీసీఎం డ్రైవర్ మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

నెహ్రు ఔటర్ రింగ్ రోడ్డు అర్థరాత్రి నెత్తురోడింది. కర్నూలు నుండి పచ్చిమిర్చి లోడ్ తో వరంగల్ వెళ్తున్న డీసీఎం ఔటర్ పై ఆధిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల సమీపంలో టైర్ పంచర్ అయి ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని కొత్తపేట కు చెందిన ఎరుకల తిమ్మరాజు(28)) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో డీసీఎం క్యాబిన్ లో మృతదేహాన్ని, మరొకరిని బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది. త‌ర్వాత‌ వారిని ఆసుపత్రికి తరలించారు. ఆధిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.