
కూకట్ పల్లి జాతీయ రహదారిపై ఈ రోజు(జనవరి 10) ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. ట్రక్కును ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో అదుపు తప్పిన లారీ.. పక్కనే ఉన్న వాహనాల పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో పక్కనే వస్తున్న కారును లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం నుజ్జు నుజ్జు అయింది.
లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.