లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

లారీని ఢీకొన్న కారు.. నలుగురు మృతి

అనంతపురం పెనుగొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మంగళవారం తెల్లవారుజామున కియా మోటార్స్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీ స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో కావడంతో వెనుక నుంచి వస్తున్న కారు కంట్రోల్ కాకపోవడంతో బలంగా ఢీకొట్టింది. దాంతో కారులోని నలుగురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలున్నారు. వీరంతా బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఆక్సిడెంట్ జరిగింది. వీరంతా ఢిలీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.